సల సల మరిగే నీటిని భర్త మర్మాంగంపై పోసిన భార్య

by Disha Web Desk 2 |
సల సల మరిగే నీటిని భర్త మర్మాంగంపై పోసిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం హనుమాన్ నగర్‌లో మసిలే నీటిని ఓ భార్య.. భర్త మర్మాంగంపై పోసింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు నాయిని ప్రభుదాసు, అనూషా మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తన భర్త మర్మాంగంపై సల సల మరిగే నీటిని పోసి భార్య హత్యాయత్నం చేసింది. మర్మాంగం కాలిపోయి తీవ్ర గాయాలతో నాయిని ప్రభుదాసు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed