నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి

by Disha Web Desk 4 |
నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాజు కొడుకు అన్విత్ (3) సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయంలో ఇంటి ముందు బాల్‌తో ఆడుకుంటుండగా బాల్ నీటి సంపులో పడడంతో బంతి కోసం సంపులోకి వంగిన చిన్నారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే చిన్నారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed