అగివున్న లారీని ఢీకొన్న బైక్...భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

by Disha Web Desk 15 |
అగివున్న లారీని ఢీకొన్న బైక్...భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
X

దిశ, జక్రాన్ పల్లి : జాతీయ రహదారి పై గురువారం ఆగివున్న లారీని బైకు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న దంపతుల్లో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి పై గురువారం చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహావీర్ తండాకు చెందిన జాదవ్ సుధాకర్ అనే వ్యక్తి తన భార్య శిరీషను బైకుపై

ఎక్కించుకొని బంధువుల ఊరికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొట్టాడు. దాంతో సుధాకర్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య శిరీషకు తీవ్రగాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.

Next Story

Most Viewed