ఇద్దరు భారతీయులు సహా 12 మంది మృతి: నేపాల్‌లో ఘోర ప్రమాదం

by Dishanational2 |
ఇద్దరు భారతీయులు సహా 12 మంది మృతి: నేపాల్‌లో ఘోర ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 12మృతి చెందగా..మరో 22మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు భారతీయులున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి నేపాల్ గంజ్ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు సెంట్రల్ వెస్ట్రన్ నేపాల్‌లోని డాంగ్ జిల్లాలో అదుపుతప్పి రాఫ్తీ నదిలోకి దూసుకెళ్లింది. దీంతో 12మంది మరణించగా.. అందులో 8మంది ప్రయాణికులను గుర్తించినట్టు తెలిపారు. అలాగే ఇద్దరు భారతీయులను బిహార్‌కు చెందిన యోగేంద్ర రామ్ (67), ఉత్తరప్రదేశ్‌కు చెందిన మునే (31)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం లామాహి ఆస్పత్రికి తరలించినట్టు బాలుబాంగ్ ఏరియా చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఉజ్వల్ బహదూర్ సింగ్ వెల్లడించారు.


Next Story

Most Viewed