అయోధ్య రామమందిర ప్రధానార్చకుడిగా 22 ఏళ్ల యువకుడు, అతడే ఎందుకు?.. కారణం తెలిస్తే షాక్ అవుతారు?

by Disha Web Desk 1 |
అయోధ్య రామమందిర ప్రధానార్చకుడిగా 22 ఏళ్ల యువకుడు, అతడే ఎందుకు?.. కారణం తెలిస్తే షాక్ అవుతారు?
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు చకాచకా ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పూజలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న జరగబోయే మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కన్నులతో వేచి చేస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య రామమందిర ప్రధానార్చకుడి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయోధ్య శ్రీరాముడికి దాదాపు 31 సంవత్సరాల నుంచి ఆచార్య సత్యేంద్ర దాస్ అనే అర్చకుడు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 1958లో శాశ్వతంగా అయోధ్యకు వచ్చి 1992లో ఆలయ పూజారిగా నియమించబడి తన జీవితంలో సగభాగం ఆ రాముడి సేవకే అంకితం చేశారు.

అప్పటి నుంచి నేడు నూతన ఆలయం నిర్మించే వరకు ఆయనే ఆలయ ప్రధానార్చకుడిగా కొనసాగుతున్నారు. కానీ, ప్రస్తుతం ఆయన వయసు 85 ఏళ్లు, దీంతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం రామ మందిరంలో ఆయన తరువాత ప్రధానార్చకుడిగా మరొకరిని నియమించే బాధ్యత సత్యేంద్రకే అప్పగించింది. ఈ మేరకు 2023లోనే యూపీ ప్రభుత్వం రామ మందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు 3 వేల మంది పూజారులు ప్రధానార్చకుడి పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, దరఖాస్తుల స్వీకరణలో కొన్ని షరతులు కూడా పెట్టారు. దరఖాస్తుదారుడి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. గురుకుల విద్యను అభ్యసించి ఉండాలని, శ్రీరాముడి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలు పెట్టారు. దరఖాస్తులను వడబోసి అందులో రెండు వందల మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా.. అందులో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 22ఏళ్ల మోహిత్ పాండే కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు.

ఇంటర్వ్యూ చేసే ప్యానెల్‌లో హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా, అయోధ్యలోని మహంత్ మిథిలేష్, నంది శరణ్, సత్యనారాయణ్ దాస్ ఉన్నారు. వారంతా వేదాల నుంచి ఆరాధనా పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. అయోధ్యలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఆరంభించారు. ఈ సందర్భంగా వారు దరఖాస్తుదారులను శ్రీరాముడి పూజలకు సంబంధించిన ప్రశ్నలు, సంధ్యా వందనం అంటే ఏంటి, పూజ పద్ధతులు, కర్మకాండ అంటే ఏంటి, రాముడి పూజకు ఎలాంటి మంత్రాలు పఠిస్తారనే ప్రశ్నలు సంధించారు. ఇంటర్వ్యూకి వచ్చిన 200 మందిలో చివరకు 21 మందిని అర్చుకులను ఎంచుకున్నారు. అందులో ఒక ప్రధాన అర్చక పదవితో పాటు 20 మందిన సహాయ అర్చకులను ఎంచుకున్నారు.

వారందిరిలోనూ చర్చకు వస్తున్న పేరు మోహిత్ పాండే. కేవలం 22 ఏళ్ల వయసు గల మోహిత్ రామ మందిర ప్రధానార్చకుడిగా నియమించబడ్డాడనే వార్త సంచలనంగా మారింది. ఇంటర్వ్యూలో మోహిత్ తన కంటే ఎంతో పెద్ద పండితులను, అనుభవం ఉన్న పూజారులను ఓడించాడు. ప్యానెల్ మెంబర్లను సైతం మెప్పించాడు. ప్రస్తుత ఆలయ అర్చకుడు సత్యేంద్ర దాస్ మన్ననలు పొందాడు. మోహిత్ తాను పదేళ్ల వయసులోనే రామాయణం, మహాభారతం లాంటి వేదాలను పఠించడం ప్రారంభించాడు. 2020-2021 విద్యా సంవత్సరంలో ఘజియాబాద్‌‌లోని దుదేశ్వర్ వేద్ విద్యా పీఠ్‌లో తన పదో తరగతి విద్యను పూర్తి చేశాడు. ఎస్.వీ.వీ.యూ బీఏ ప్రోగ్రాంలో చేరాడు. అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఎంఏ డిగ్రీ చదివి పీహెచ్‌డీకి సిద్ధం అవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆలయ ప్రధానార్చకుడిగా సత్యేంద్ర దాస్ కొనసాగుతుండగా, శిక్షణ అనంతరం మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధానార్చకుడిగా బాధ్యతలను స్వీకరించనున్నాడు.







Next Story

Most Viewed