ఏపీలో 9,901 కరోనా కేసులు

by  |
ఏపీలో 9,901 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన 24గంటల్లో 75,465మందికి పరీక్షలు నిర్వహించగా 9,901 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,57,587కు చేరింది. 67మరణాలు సంభవించడంతో కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,846గా ఉంది. ప్రస్తుతం 95,733 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 4,57,008 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 10,292మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 45,27,593 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి కడప జిల్లాలో 9మంది, చిత్తూరులో 8మంది, ప్రకాశంలో 8మంది, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, విశాఖలో ఐదుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,398 కరోనా పాజిటివ్‌లు రాగా ప్రకాశం జిల్లాలో 1,146, పశ్చిమ గోదావరిలో 1,069, చిత్తూరులో 932, కడపలో 792, నెల్లూరులో 711, అనంతపురంలో 680, విశాఖలో 584, విజయనగరంలో 583, శ్రీకాకుళంలో 555, కర్నూలులో 505, గుంటూరులో 479, కృష్ణా జిల్లాలో 467 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed