9తీర్మానాలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ఆమోదం

by  |
9తీర్మానాలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ఆమోదం
X

దిశ, న్యూస్​బ్యూరో: జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్యక్షత‌న గురువారం స్టాండింగ్ కమిటీ ​సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీడిమెట్ల, ఫ‌తుల్లాగూడ‌లో నెల‌కొల్పిన‌ నిర్మాణ వ్యర్థాలు, శిథిలాల రీసైక్లింగ్ ప్లాంట్ల వ‌ద్ద ఆరుగురు అసిస్టెంట్లను న్యాక్ నుంచి ఔట్ సోర్సింగ్ ప‌ద్దతిలో నియమించడంతో పాటు 9 అంశాల‌ను చ‌ర్చించి ఆమోదించారు. ఈ స‌మావేశంలో క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌, స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు గంధం జోత్స్న, ముద్రబోయిన శ్రీ‌నివాస‌రావు, మీర్ బాసిత్ అలీ, మిర్జా ముస్తఫా బేగ్‌, సున్నం రాజ్‌మోహ‌న్‌, మ‌హ్మద్ న‌జీర్ ఉద్దీన్‌, మ‌హ్మద్ మాజిద్ హుస్సేన్, ముఠా ప‌ద్మన‌రేష్‌, కొల‌ను ల‌క్ష్మి పాల్గొన్నారు.



Next Story

Most Viewed