నేలకొండపల్లిలో 9 పాజిటివ్ కేసులు

by  |
నేలకొండపల్లిలో 9 పాజిటివ్ కేసులు
X

దిశ‌, పాలేరు: ఖ‌మ్మం జిల్లా నేలకొండపల్లి ఆరోగ్య కేంద్రంలో బుధ‌వారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. బోదులబండ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో 3 పరీక్షలు నిర్వహించగా, అందులో దంపతులిద్ద‌రికీ పాజిటివ్‌గా తేలింది. నేల‌కొండ‌ప‌ల్లి మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తికి ఖమ్మంలో, పైనంపల్లికి చెందిన వారికి కోదాడలో పరీక్షలు నిర్వహించగా, అందులో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు తెలిపారు. దీంతో వారికి కాంటాక్ట్ అయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.



Next Story

Most Viewed