షాకింగ్.. హోటల్‌లో 82 మందికి కరోనా పాజిటివ్

by  |
India corona cases
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని తాజ్‌ హోటల్‌లో కరోనా కలకలం సృష్టించింది. హోటల్‌లో ఏకంగా 82 మంది సిబ్బందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ హోటల్‌ను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

హోటల్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. గత గురువారం హోటల్‌లో 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం అందరికీ నిర్ధారణ పరీక్షలు చేయించింది. దీంతో తాజా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఏప్రిల్ 1వ తేదీన కుంభమేళాకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేయాలని యోచిస్తోంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed