వరంగల్ కమిషనరేట్‌‌ను తాకిన కరోనా.. 8మందికి పాజిటివ్

by  |
వరంగల్ కమిషనరేట్‌‌ను తాకిన కరోనా.. 8మందికి పాజిటివ్
X

దిశ, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ను కరోనా మహమ్మారి తాకింది. దీంతో కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తాజాగా పరీక్షలు నిర్వహించగా 8 మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఒకరు సీనియర్ అసిస్టెంట్, ఎల్డీసీ, హోంగార్డ్, స్వీపర్, మరో ఉద్యోగి కూడా ఉన్నారు. మరి కొంతమంది సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ఇటీవల పోలీస్ కమిషనర్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన ఓ వేడుక అనంతరం పోలీస్ శాఖలో కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇదిలాఉండగా, ఎక్కడ తమకు కూడా కరోనా సోకుతుందోనని చాలా మంది ఉద్యోగులు భయం గుప్పిట్లో ఉన్నట్లు సమాచారం.

Next Story

Most Viewed