బాలికను సంచిలో చుట్టి తీసుకెళ్తుండగా.. ఒక్కసారిగా!

by  |
బాలికను సంచిలో చుట్టి తీసుకెళ్తుండగా.. ఒక్కసారిగా!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామంలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం ఏడేళ్ల పాపను గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎవరూ చూడకుండా బాలికను సంచిలో చుట్టి సైకిల్ పై తీసుకెళ్తుండగా ఒక్కసారిగా ఆ చిన్నారి జారీ కిందపడిపోయింది.

గమనించిన గ్రామస్తులు తొలుత ఆ వ్యక్తిని చుట్టుముట్టి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. అయితే, బాలిక ఎవరు.. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడనే విషయాలు ఇంకా తెలియరాలేదు.


Next Story