7కిలోల బంగారం పట్టివేత..

by  |
7కిలోల బంగారం పట్టివేత..
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి ఇండియాకు గుట్టుచప్పుడు కాకుండా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పలుమార్లు తనిఖీల్లో పట్టుబడినా వీరిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. మరికొందరు ప్యాసింజర్స్ ముసుగులో బంగారం అక్రమ దందా సాగిస్తున్నారు. కస్టమ్స్ తనిఖీల్లో రోజువారీగా బంగారం పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది.

తాజాగా చెన్నై ఏయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.రూ.3.56కోట్ల విలువైన 7కిలోల బంగారాన్ని తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా దుబాయ్ నుంచి బంగారాన్ని చైన్నైకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.



Next Story

Most Viewed