దేశంలో కొత్తగా 79,476 కరోనా కేసులు

by  |
దేశంలో కొత్తగా 79,476 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 79,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,73,545 కు చేరింది. వీరిలో 54,27,707 మంది వైరస్ బారి నుంచి రికవరీ కాగా, మరో 9,44,996 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కొత్తగా 1,069 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో మరణాల సంఖ్య 1,00,842కు చేరింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ నుంచి 75,628 మంది కోలుకున్నారు.


Next Story