ఇద్దరి మధ్య గొడవ.. ఆపబోయిన వృద్ధురాలు మృతి

by  |
ఇద్దరి మధ్య గొడవ.. ఆపబోయిన వృద్ధురాలు మృతి
X

దిశ, మునుగోడు: ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపబోయిన వృద్ధురాలు మృతిచెందిన ఘటన నారాయణపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇదే మండలానికి చెందిన గంట ఆంజనేయులు, దూసర్ల రాజశేఖర్‌‎ల మధ్య గత రెండు రోజులుగా తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం వీరిద్దరూ.. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో మరోసారి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న లక్ష్మమ్మ, గోల్లూరి ముత్తమ్మ(70) వారిని విడిపించే ప్రయత్నం చేశారు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న దూసర్ల రాజశేఖర్ ఒక్కసారిగా ముత్తమ్మను అడ్డురావొద్దని నెట్టివేశాడు. ఈ క్రమంలో పక్కనే ఉండ బండరాయి ముత్తమ్మ తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed