ఘోరం.. యూపీలో ఒకేసారి ఆరుగురు మృతి

by  |
ఘోరం.. యూపీలో ఒకేసారి ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. లక్నో శివార్లలోని కకోరీ ప్రాంతంలో బుధవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed