- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాచుతోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు 5 వేల పైబడి కేసులు నమోదవుతుడటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,609 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 132 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులను కలుపుకుంటే మొత్తం బాధితుల సంఖ్య 1,12,359కి చేరింది. వీరిలో 3,435 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 45,300 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 63,624 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే 39,297 కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 13,191 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో.. 12,537 కేసులతో గుజరాత్ మూడో ప్లేస్లో కొనసాగుతోంది.
Next Story