ఇరాన్ నుంచి చివరి బృందం రాక

by  |
ఇరాన్ నుంచి చివరి బృందం రాక
X

ఇరాన్ నుంచి 53 మంది భారతీయులతో వచ్చిన విమానం రాజస్థాన్ లోని జైసల్మేర్ విమానాశ్రయానికి చేరుకుంది. వీరిలో 52 మంది విద్యార్థులు కాగా, ఒకరు టీచర్. వీరిని జైసల్మేర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలించినట్లు విదేశాంగమంత్రి జయశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 389 మంది భారత్‌కు చేరుకున్నారు. ఇరాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చింది. ఇందుకు సహకరించిన ఇరాన్ ప్రభుత్వానికి విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గత మంగళవారం 58 మంది, శుక్రవారం 44 మంది, ఆదివారం 234 మంది రాగా, సోమవారం 53 మందితో కూడిన చివరి బృందం భారత్‌కు వచ్చింది.


Next Story

Most Viewed