పోలీసుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : హోం మంత్రి

by  |
పోలీసుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : హోం మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇటీవల కరోనా కేసులతో పాటు కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ విధుల్లో భాగంగా కరోనాతో పోరాడి చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. కరోనాతో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన పోలీసులకు సరైన వైద్య సేవలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed