కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్..

by  |
కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఐదు రాష్టాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంనే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నాలుగో విడత పోలింగ్ కాసేపటి కిందటే ప్రారంభం మైంది. ఇప్పటికే మూడు విడతల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 8 విడతల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ఎన్నికల సంఘం పకడ్భందీ చర్యలు చేపట్టింది.

అయితే, నాలుగో దశలో మొత్తం 5జిల్లాల్లో 44 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. చివరి నిమిషం వరకు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా 15,940 పోలింగ్ కేంద్రాల వద్ద 789కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed