జీహెచ్ఎమ్‌సీలో కొత్తగా 48 కరోనా కేసులు

by  |
జీహెచ్ఎమ్‌సీలో కొత్తగా 48 కరోనా కేసులు
X

దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 228 కోవిడ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే అత్యధికంగా జీహెచ్ఎమ్ సీ పరిధిలో 48 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొవిడ్ 19 తో ఒకరు మరణించగా, అదే సమయంలో 152 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,01,161 చేరింది. ఇందులో 2,97,515 కోలుకోగా 1,653 మంది చనిపోయారు. ప్రస్తుతం 1993 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అందులో 795 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు.

Next Story

Most Viewed