- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: జీహెచ్ఎంసీ మినహా 139 అర్బన్ లోకల్ బాడీస్(మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు) పరిధిలో దాదాపు 77 లక్షల మంది (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉండగా.. 7,685 పబ్లిక్ టాయిలెట్స్ అవసరముందని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం 2,989 పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉండగా.. అదనంగా 4,696 పబ్లిక్ టాయ్ లెట్స్ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అందులో భాగంగా వచ్చే పంద్రాగస్టు నాటికి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో అదనంగా 4,696 పబ్లిక్ టాయ్లెట్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ మంగళవారం ఆదేశించారు. పురపాలక శాఖ నిర్ణయించిన 23 రకాల ‘స్మార్ట్ వాష్ రూమ్స్’ నిర్మాణాలు చేపట్టాలని ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్థానిక పరిస్థితులు, జనాభా అవసరాలకు లోబడి డిజైన్లను వినియోగించుకోవాలని అర్వింద్ కుమార్ ఈ సందర్భంగా సూచించారు.