దేశంలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..

by  |
India corona cases
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 46,951 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి మరో 212 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 21,180 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 1,16,46,081 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా 1,59,967 మృత్యువాత పడ్డారు.

ప్రస్తుతం దేశంలో 3,34,646 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 23 కోట్ల 44 లక్షల దాటింది.



Next Story

Most Viewed