అర్ధరాత్రి అలా కనిపించిన మహిళ.. కట్టేసి కోరిక తీర్చుకున్న కామాంధులు

by  |
Gang rape
X

దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి కాలకృత్యాల కోసం నది ఒడ్డుకు వెళ్లిన వివాహితను టవల్‌తో కట్టేసి అత్యాచారం చేసిన ఘటన ఒడిశాలోని పూరి జిల్లా నిమపారాలో వెలుగుచూసింది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ శుక్రవారం(నవంబర్ 12) అర్ధరాత్రి కాలకృత్యాల కోసం సమీపంలోని కాలువ ఒడ్డుకు వెళ్లింది. ఒంటరిగా ఉందని గమనించిన నలుగురు వ్యక్తులు ఆమెను ఓ టవల్‌తో కట్టేసి రేప్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు.. ఇలా నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. కాలకృత్యాలకు వెళ్లిన మహిళ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు కాలువ వద్దకు వెళ్లి చూడగా.. తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్టు పూరి జిల్లా ఎస్పీ తెలిపారు.



Next Story

Most Viewed