సంగారెడ్డిలో 320 కిలోల గంజాయి పట్టివేత

by  |
సంగారెడ్డిలో 320 కిలోల గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా కంకోల్‌ టోల్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెండు వాహనాల్లో మత్తు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 320 కిలోల గంజాయిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, గంజాయిని తరలిస్తున్న రెండు వాహనాలతో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్న విషయంపై విచారణ చేస్తున్నారు.



Next Story