కుంభమేళాలో కరోనా కలకలం..

by  |
కుంభమేళాలో కరోనా కలకలం..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో కరోనా కలకలం సృష్టించింది. నాలుగు రోజులుగా జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటి వరకు 300లకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుంభమేళకు వచ్చే భక్తులు 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. నెగెటివ్ అని రిపోర్ట్ వస్తేనే కుంభమేళా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

అంతేకాదు, కుంభమేళాలో పాల్గొనే భక్తులకు కఠిన నిబంధనలు విధించారు. మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ఘాట్లు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.

Next Story

Most Viewed