బిగ్ బ్రేకింగ్ : ఆర్మీ ఆధీనంలో జైషే మహ్మద్ చీఫ్.. ముగ్గురి హతం!

by  |
బిగ్ బ్రేకింగ్ : ఆర్మీ ఆధీనంలో జైషే మహ్మద్ చీఫ్.. ముగ్గురి హతం!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ఆర్మీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రశాంతంగా ఉన్న దేశంలో విధ్వంసాలు సృష్టించి, శాంతి భద్రతలకు పలుమార్లు సవాల్ విసిరిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్‌ను గురువారం భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

అంతకుముందు జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఆ తర్వాత జైషే మహ్మద్ చీఫ్ అన్సర్ ఘజ్వత్‌‌ను భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇది ఇండియన్ ఆర్మీకి ఘన విజయంగా భావించవచ్చునని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed