ఆ గ్రామంలో వరసగా కూలుతున్న ఇండ్లు

by  |
ఆ గ్రామంలో వరసగా కూలుతున్న ఇండ్లు
X

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ఒకే గ్రామంలో 3 ఇండ్లు కూలిపోయాయి. దీంతో బాధిత కుటుంబా కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ మండలం కోటకదిర గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. ఆ గ్రామంలో ఆదివారం 3 ఇండ్లు కూలిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మార్వో కిషన్ తోపాటు పంచాయతీ సెక్రెటరీ మాధవి, వీఆర్వో వెంకట్ రాములు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Next Story