- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారుల మృతదేహాలు బావిలో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపాయి. పశువుల కాపరులు బావి దగ్గరకు వెళ్లగా అందులో మృతదేహాలు తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లిలో బావిలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు పడి మృతి చెందారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. మృతులు అనిత (27), గణేష్ (6) భార్గవ్ (4)గా గుర్తించారు. రాయచోటి మండలం సిద్ధారెడ్డిపల్లె వాసులుగా గుర్తించారు. ఆ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి తన ఇద్దరు పిల్లలను ముందు బావిలోకి తోసేసి ఆ తర్వాత ఆమె కూడా దూకి ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.