తూర్పు గోదావరిలో విషాదం.. ముగ్గురు మృతి

by  |
తూర్పు గోదావరిలో విషాదం.. ముగ్గురు మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. వ్యవసాయ బావిలో పడి బాలిక, ఇద్దరు యువకులు మృతి చెందారు. గుమ్మిలేరు నుంచి దోసకాయలపల్లికి ద్విచక్రవాహనంపై వస్తుండగా బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు వ్యవసాయ బావిలో పడి మరణించినట్లు తెలుస్తోంది. మృతులు చిన్నం శిరీష (13), గుమ్మడి సన్నీ (18), చిన్నం వీర్రాజు (18)గా పోలీసులు గుర్తించారు. చిన్నం వీర్రాజు, శిరీష సొంత అన్నా చెల్లెలు అని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Next Story