తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు

by  |
తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో తాజాగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,91,666కి చేరింది. ఇప్పటివరకు 1,577 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,191 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,85,898 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story