భారత్‌లో 25 వేలకు దిగువన కేసులు

by  |
భారత్‌లో 25 వేలకు దిగువన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా గత 24 గంటల్లో 24,010 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 355 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,56,558 కి చేరింది. ఇప్పటివరకు 1,44,451 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 3,22,366 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 94,89,740 మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story