దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

by  |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయనుకునేలోపే మళ్లీ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 22,431 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 318 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 4,49,856 కి చేరింది. అలాగే నిన్న కరోనా నుంచి 4,49,856 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,44,198 యాక్టివ్ కేసుల సంఖ్య ఉండగా అందులో కొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

Next Story

Most Viewed