పేకాట స్థావరంపై దాడి, భారీగా నగదు స్వాధీనం

by  |
పేకాట స్థావరంపై దాడి, భారీగా నగదు స్వాధీనం
X

దిశ, క్రైమ్ బ్యూరో: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. బుధవారం అలీజాపూర్ హ్యాపీ హోమ్స్ కాలనీలో పేకాడుతున్న 21 మందిని అరెస్ట్ చేసి, నిందితుల నుంచి రూ.9.11లక్షల నగదు, 19సెల్ ఫోన్లు, 198గేమింగ్ కాయిన్స్, 4సెట్ల ప్లేయింగ్ కార్డ్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలు నిమిత్తం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్టు సైబరాబాద్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్ తెలిపారు.


Next Story

Most Viewed