- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఓ వివాహిత మరణానికి కారణం హత్యనా..? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంపై తీవ్ర సందిగ్ధం నెలకొంది. 20 ఏళ్ల వివాహిత అనుకోకుండా రక్తపు ముడుగులో పడి ఉండటాన్ని అత్తింటి వారు తొలుత గుర్తించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ప్రమాదవశాత్తు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హార్దోయిలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. పెళ్ళయిన యువతి తన మామకు చెందిన 12-బోర్ సింగిల్ బారెల్ తుపాకీతో సెల్ఫీ దిగుతుండగా అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ తగిలి ఆమె మరణించినట్లు అత్తింటి వారు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో ఆమె ట్రిగ్గర్ నొక్కినట్లు మొబైల్లో ఫోటో ఉందని పోలీసులు గుర్తించారు. ఆ చిత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే, ఆమె చనిపోయే కొద్ది సెకన్ల ముందు ఈ పిక్ క్లిక్ చేసినట్లు షాహాబాద్ ఎస్హెచ్ఓ శివశంకర్ సింగ్ వెల్లడించారు. ఇదిలాఉండగా, తమ కూతురిని కట్నం కోసం అత్తింటి వారే చంపేసి.. సెల్ఫీ తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలా క్రియేట్ చేస్తున్నారని బాధిత తండ్రి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వరకట్నం కారణంగానే వివాహిత చనిపోయిందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు.