ఆమె చావుకు కారణం వరకట్నమా..? సెల్ఫీనా..!

by  |
bride-groom
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ వివాహిత మరణానికి కారణం హత్యనా..? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంపై తీవ్ర సందిగ్ధం నెలకొంది. 20 ఏళ్ల వివాహిత అనుకోకుండా రక్తపు ముడుగులో పడి ఉండటాన్ని అత్తింటి వారు తొలుత గుర్తించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ప్రమాదవశాత్తు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హార్దోయిలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. పెళ్ళయిన యువతి తన మామకు చెందిన 12-బోర్ సింగిల్ బారెల్ తుపాకీతో సెల్ఫీ దిగుతుండగా అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ తగిలి ఆమె మరణించినట్లు అత్తింటి వారు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో ఆమె ట్రిగ్గర్ నొక్కినట్లు మొబైల్‌లో ఫోటో ఉందని పోలీసులు గుర్తించారు. ఆ చిత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే, ఆమె చనిపోయే కొద్ది సెకన్ల ముందు ఈ పిక్ క్లిక్ చేసినట్లు షాహాబాద్ ఎస్‌హెచ్‌ఓ శివశంకర్ సింగ్ వెల్లడించారు. ఇదిలాఉండగా, తమ కూతురిని కట్నం కోసం అత్తింటి వారే చంపేసి.. సెల్ఫీ తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలా క్రియేట్ చేస్తున్నారని బాధిత తండ్రి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వరకట్నం కారణంగానే వివాహిత చనిపోయిందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed