టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

by Disha Web Desk 12 |
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్ ఈ రోజు భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరుగుతుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నెదర్లాండ్స్ జట్టు బౌలింగ్ చేయనుంది. కాగా వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత్ పసికూనలపై ఈ రోజు కూడా విజయం సాధించి లీగ్ స్టేజ్ లో అన్ని మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పాలని చూస్తుంది.

కాగా ఈ మ్యాచ్‌లో పలు మార్పులు ఉంటాయని అందరూ ఉహించినప్పటకి ఎటువంటి మార్పు లేకుండా భారత్ బరిలోకి దిగుతుంది. అలాగే నెదర్లాండ్స్ జట్టు భారత్ పై విజయం సాధించి సంచలనం సృష్టించాలని చూస్తోంది. అలాగే ఈ విజయంతో ఛాంపియన్ ట్రోఫీకి అర్హత సాధించాలని కూడా చూస్తుంది. మరీ ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ గెలుస్తుందా లేదా తెలియాలంటే చూడాలి మరి.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్


Next Story

Most Viewed