WorldCup: కాసేపట్లో కీలక మ్యాచ్.. టీమిండియాకు BIG షాక్

by Disha Web Desk 2 |
WorldCup: కాసేపట్లో కీలక మ్యాచ్.. టీమిండియాకు BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై ఇరు జట్లు దృష్టి సారించాయి. గెలిస్తే మళ్లీ టీమిండియా టేబుల్ టాపర్‌గా నిలవడంతో పాటు, సెమీస్ బెర్తు దాదాపు ఖరారు కానుంది. దీంతో ఈ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లాండ్.. ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇవాళ ఓడితే నేరుగా ఇంటి బాట పట్టే అవకాశం ఉండటంతో ఇంగ్లాండ్ తప్పనిసరి గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఇదిలా ఉండగా.. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. టీమిండియాకు అనూహ్య షాక్ తగిలింది.

శనివారం ప్రాక్టీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు సమాచారం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ మణికట్టుకు గాయమైనట్లు తెలుస్తోంది. వేగంగా దూసుకువచ్చిన బంతి రోహిత్ కుడిచేతి మణికట్టును బలంగా తాకగా, హిట్ మ్యాన్ బాధతో విలవిల్లాడి పోయాడట. దీంతో టీమిండియా ఫిజియో వెంటనే అక్కడకు చేరుకుని చికిత్స చేసినట్లు తెలిసింది. అయితే రోహిత్‌ గాయం విషయంపై అటు బీసీసీఐ కానీ, ఇటు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రపంచకప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న హిట్‌ మ్యాన్‌ దూరమైతే టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇవాళ్టి మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నాడు.

Next Story

Most Viewed