వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్

by Disha Web Desk 2 |
వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: క్రికెట్​బెట్టింగ్​నిర్వహిస్తున్న ఇద్దరిని దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్​అధికారులు ఐఎస్ సదన్​పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.79 వేల నగదుతోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్​అదనపు డీసీపీ ఏ.వీ.ఆర్.నరసింహారావు వివరాల ప్రకారం.. చంపాపేట్ వాస్తవ్యులైన యశ్వంత్​(34) ప్రైవేట్​ఉద్యోగి. అదే ప్రాంతంలో ఉంటున్న ప్రవీణ్​కుమార్​(38) వ్యాపారి.

ఇటీవల జరిగిన క్రికెట్ వరల్డ్ కప్​సమయంలో తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ఈ ఇద్దరు జోరుగా క్రికెట్​బెట్టింగులు నిర్వహించారు. దీంట్లో కింగ్​పిన్​అయిన మియాపూర్​నివాసి ప్రసాద్​ఈ ఇద్దరికి ఎంపీ కింగ్, గో ఎక్స్​ఛేంజ్​తదితర యాప్‌లకు సంబంధించిన లాగిన్​ఐడీలు, పాస్‌వర్డులు అంద చేసి బెట్టింగ్​దందా జరిపించాడు. ఈ మేరకు పక్కాగా సమాచారం అందటంతో టాస్క్​ఫోర్స్​సీఐ మధుసూదన్, ఎస్సైలు నర్సింలు, ఆంజనేయులు, నవీన్‌తో పాటు ఐఎస్​సదన్​పోలీసులతో కలిసి యశ్వంత్, ప్రవీణ్​కుమార్‌లను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రసాద్​కోసం గాలిస్తున్నారు.



Next Story

Most Viewed