మరింత క్రేజీగా టీమిండియా ఫస్ట్ మ్యాచ్.. స్టార్ హీరోతో ఫ్యాన్స్‌కు ట్రీట్!

by Disha Web Desk 2 |
మరింత క్రేజీగా టీమిండియా ఫస్ట్ మ్యాచ్.. స్టార్ హీరోతో ఫ్యాన్స్‌కు ట్రీట్!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆదివారం వరల్డ్ కప్‌లో భాగంగా భారత జట్టు మొదటి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. ఈ క్రమంలో మ్యాచ్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా చేసేందుకు నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తెలుగు అభిమానులకు ఇది శుభవార్త. ఈ మ్యాచ్‌కు ముందు తెలుగు క్రికెట్ లైవ్ షోలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ పాల్గొననున్నాడు. అంతేకాకుండా క్రికెట్ అభిమానులతో రవితేజ ముచ్చటించనున్నాడు.


భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం మధ్యాహ్నాం 2 గంటలకు మ్యాచ్ మొదలుకానుండగా.. 12.30 గంటల నుంచే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఈ లైవ్ షో రానుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. రవితేజ ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు మూవీతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేశంలోనే అతిపెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.



Next Story

Most Viewed