టీమిండియాను ఎలా ఓడించాలో మాకు తెలుసు.. నెదర్లాండ్స్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 2 |
టీమిండియాను ఎలా ఓడించాలో మాకు తెలుసు.. నెదర్లాండ్స్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా జరుగుతోన్న 2023 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం టేబుల్ టాప్‌లో కొనసాగుతోంది. ఈ వవర్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ భారత్ vs నెదర్లాండ్స్ జట్ల మధ్య జరుగనుంది. ఈనెల 12వ తేదీన బెంగళూరులోని చినస్వామి మైదానం వేదికగా జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌పై నెదర్లాండ్స్ ప్లేయర్ తేజ నిడమనూరు జోస్యం చెప్పారు. తప్పకుండా ఇండియాను ఓడిస్తామని ప్రకటించారు. రోహిత్ సేనను ఓడించే ప్లాన్స్ తమ వద్ద ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. స్పిన్ ఆడే ప్లేయర్లూ తమ వద్ద కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ తేజపై మండిపడుతున్నారు. భారత సంతతికి చెందిన నువ్వు జట్టును ఓడిస్తానని మాట్లాడుతావా? అని సీరియస్ అవుతున్నారు. కాగా, తేజది ఏపీలోని విజయవాడ కావడం గమనార్హం.




Next Story

Most Viewed