2 వేల ఏళ్ల కిందటి కాయిన్స్ లభ్యం!

by  |
2 వేల ఏళ్ల కిందటి కాయిన్స్ లభ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య పలుచోట్ల జరిపిన తవ్వకాల్లో పురాతన కాలం నాటి వస్తువులు బయటపడుతున్నాయి. తమిళనాడు కాంచీపురం జిల్లాలోని కుళంబేశ్వర ఆలయంలో మరమ్మతు పనుల కోసం తవ్వకాలు జరపగా.. బంగారు నాణేలు, నగలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడ ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మహమ్మదాబాద్ గ్రామంలో పురాతన కాలం నాటి కాయిన్స్ బయటపడ్డాయి.

గ్రామస్తులు తమ పనుల నిమిత్తం మట్టి తవ్వకాలు చేపట్టగా, వారికి వివిధ విగ్రహాల ఆకృతితో ఉన్న 128 కాయిన్స్ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, పురావస్తు శాఖకు సమాచారమిచ్చినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ కుమార్ బన్సల్ తెలిపారు. నాణేలు సుమారు 1,500 నుంచి 2 వేల ఏళ్ల క్రితం నాటివని చెప్పారు. కాయిన్స్ దొరికిన ప్లేస్‌ను భారత పురావస్తు శాఖ వారు ఆధీనంలోకి తీసుకుంటారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed