రెండువేల సంవత్సరాల నాటి రథం లభ్యం.. ఎక్కడంటే

by  |
రెండువేల సంవత్సరాల నాటి రథం లభ్యం.. ఎక్కడంటే
X

దిశ, ఫీచర్స్ : పురాతన కాలంలో రాజులు అందంగా అలంకరించిన రథాలపై ఊరేగేవారనేది నిజమే అనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇటలీలోని పురావస్తు ప్రదేశం పొంపై(Pompeii)లో 2 వేల ఏళ్ల కిందటి రథాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీశారు. నాలుగు చక్రాలతో అందంగా అలంకరించబడిన ఈ రథాన్ని గుర్రాలు లాగేవని నిర్ధారించారు. ఎందుకంటే 2018లో ఈ ప్రదేశానికి దగ్గరలో మూడు గుర్రాల అవశేషాలు లభ్యమయ్యాయి. ఇనుము, కాంస్యం, కలప‌తో ఈ రథాన్ని రూపొందించినట్లు అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు.. 21వ శతాబ్దంలో ఈ ప్రదేశం (పొంపై) కొలాప్స్ అయ్యుండొచ్చని చెప్తున్నారు.

కాగా రాజుతో పాటు రాజకుటుంబీకులు ఈ రథాల్లో తిరిగేవారని, ఇది అప్పటి కాలం ‘లంబోర్ఘిని’ వెహికల్ అని పలువురు ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే పురాతన రథాలను గుర్తించడం అసాధారణ ఆవిష్కరణ అని, ఆ కాలంలోనే ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడేవారని మనం అర్థం చేసుకోవాలని పొంపై ఆర్కియాలజికల్ సైట్ డైరెక్టర్ మస్సిమొ ఒసన్న పేర్కొన్నారు. ఇక పొంపై ఆర్కియాలజికల్ సైట్‌ను యునైటెడ్ నేషన్స్(UN) స్పెషలైజ్డ్ ఏజెన్సీ యునెస్కో(UNESCO).. ప్రపంచ వారసత్వ కేంద్రంగా(WHS) గుర్తించగా.. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంలో పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.


Next Story

Most Viewed