'మూసీలో 200 ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయి'

by  |
మూసీలో 200 ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీనదీకి ప్రవాహం పెరిగి దాదాపు 200 ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 2,660 మెగావాట్లకు పడిపోయిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే అత్యల్పమని పేర్కొన్నారు.

ఎన్డీపీసీ సహకారంతో గ్రిడ్‌కు ఇబ్బంది లేకుండా చేశామని.. ఎంత తగ్గినా, ఎంత పెరిగినా మన గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అపార్ట్‌మెంట్లలోకి నీరు రావడంతో హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని, వరదను తొలగించిన తర్వాత విద్యుత్ పునరుద్దరిస్తామని అన్నారు.



Next Story