ఘోర ప్రమాదం.. 20మంది కూలీలకు గాయాలు

by  |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగలకొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటాఎస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. దాదాపు 20మందికిపైగా తీవ్రగాయలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. కూలీలందరూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు.


Next Story