నిజామాబాద్ జిల్లాలో 20 కరోనా కేసులు

by  |
నిజామాబాద్ జిల్లాలో 20 కరోనా కేసులు
X

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుదర్శన్ తెలిపారు. 48 సాంపిళ్లలో 23 నెగిటివ్ రాగా, 20 పాజిటివ్ వచ్చాయని తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 268 పాజిటివ్ కేసులు అయ్యాయని, 48 పరీక్షల సాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కామారెడ్డి జిల్లాలో ఒకే కేసు నమోదు అయినట్టు వైద్యాధికారులు తెలిపారు.

Next Story

Most Viewed