తల్లీకొడుకుల ప్రాణం తీసిన ప్రమాదం

by  |

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా రాయచోటి రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో, కారు ఢీ కొన్న ప్రమాదంలో తల్లీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడినికి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు మృతులు తల్లి లక్ష్మీ, కుమారుడు కార్తీక్ రెడ్డిగా గుర్తించారు. బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story