ఉర్సు ఉత్సవంలో చెలరేగిన హింస.. ఇద్దరు వ్యక్తులు మృతి

by  |
ఉర్సు ఉత్సవంలో చెలరేగిన హింస.. ఇద్దరు వ్యక్తులు మృతి
X

దిశ, బోథ్: ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో నిర్వహించిన ఉర్సు ఉత్సవంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉర్సు ర్యాలీ కొనసాగుతోండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఉద్రిక్తతను అదుపు చేసేందుకు స్వయంగా ఆదిలాబాద్ ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ కార్తికేయ రంగంలోకి దిగారు. బందోబస్తులో ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు ఎస్ఐలు, ఏఆర్ ఫోర్స్ ఉన్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed