ప్యాసింజర్ ఆటోని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

by  |
ప్యాసింజర్ ఆటోని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దండేపల్లి మండలం గూడెం తనిఖీ కేంద్రం వద్ద బొలెరో వాహనం ప్యాసింజర్ ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. లక్సెట్టిపేటలో కూలీ పని కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులు దాసరి ప్రమీల(30), జ్ఞానం రవి (28)గా గుర్తించారు. గాయపడిన వారిలో దాసరి విజయ్, గొల్లడా రవి, శ్రీనివాస్, మల్లేష్ ఉండగా.. వీరిని ప్రథమ చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు.


Next Story