రెండు వాహనాలు సేమ్.. ఢీకొని ఇద్దరు మృతి

by  |
రెండు వాహనాలు సేమ్.. ఢీకొని ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హానిమిరెడ్డిపల్లిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.


Next Story

Most Viewed