తిమ్మపురంలో ఇద్దరు దుర్మరణం

by  |
తిమ్మపురంలో ఇద్దరు దుర్మరణం
X

దిశ, అమరావతి: 16వ నెంబర్ జాతీయ రహదారిపై అర్థరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మపురం సమీపంలో కారు-కంటైనర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఎడ్లపాడు ప్రభుత్వాస్పత్రి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed