ఆవుల మందపై పెద్దపులి దాడి..

by  |
ఆవుల మందపై పెద్దపులి దాడి..
X

దిశ, మహబూబ్ నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో అవుల మంద పై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటన లో రెండు ఆవులు మృత్యువాత పడగా , మరొకటి గాయాలపాలైంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. అంబగిరి ప్రాంతంలో మేత కోసం వెళ్లిన పశువుల మంద పై అకస్మాత్తుగా పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను చంపేసింది. ఈ దాడిలో మరో ఆవుదూడ గాయాల పాలైంది. అయితే, పెద్దపులి మైదాన ప్రాంతంలోకి వచ్చి ఆవుల మంద పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story